సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి, మే 11 (నమస్తేతెలంగాణ): కోర్టుల్లో కేసుల విచారణను జూన్ 30 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. రోజురోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని గత నెలలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోహ్లి ఇచ్చిన ఆదేశాల మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టులో అన్ని కేసులను వర్చువల్( ఆన్లైన్)లోనే చేస్తున్నామని, జూన్ 30వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని నాంపల్లి కోర్టు సెషన్స్ జడ్జి తుకారం తెలిపారు. వర్చువల్ విధానానికి నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు సహకరిస్తున్నారని చెప్పారు.