న్యూ ఢిల్లీ: టీకా వృథాను తగ్గించేలా చేస్తున్న కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రశంసించారు. వ్యాక్సిన్ వృథాలను తగ్గించడంలో కేరళ ప్రభుత్వం ఘణనీయంగా కృషి చేయడం వల్లనే అందరికీ డోసులు అందుతున్నాయని మోదీ చెప్పారు. కొవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమని అన్నారు.
‘వ్యాక్సిన్ల వ్యర్థాన్ని తగ్గించడంలో మన ముందు ఉదాహరణగా నిలిచిన కేరళ ఆరోగ్య కార్యకర్తలు, నర్సుల కృషిని చూస్తే చాలా ఆనందంగా ఉన్నదని, కొవిడ్-19 కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి ఇది అవసరం’ అని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ను మోదీ కొనియాడారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వృథా చేసిన గణాంకాల మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చాలా జాగ్రత్తగా టీకా పనులు చేపట్టారని మోదీ ట్వీట్ చేశారు. ‘కేరళకు కేంద్ర ప్రభుత్వం నుంచి 73,38,806 మోతాదుల వ్యాక్సిన్ వచ్చింది. ప్రతి సీసాలో వృధాగా మిగిలిన అదనపు మోతాదును ఉపయోగించి 74,26,164 డోసులను అందించగలిగాం. ఆరోగ్య కార్యకర్తలు, ముఖ్యంగా నర్సులు ఇలాంటి శుభతరుణంలో ప్రశంసించేదుకు పూర్తి అర్హులే’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇప్పటివరకు 17.02 కోట్లకు పైగా కొవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వచ్చే మూడు రోజుల్లో వారికి 36 లక్షలకు పైగా డోసులను అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్..?
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..