హైదరాబాద్ : వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతని తల్లి పద్మ(55) అక్కడికకకడే మృతి చెందగా.. యువకుడి తండ్రి రవి, సోదరి నీరజకు గాయాలయ్యాయి. వారిని వెంటనే వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. అయితే, రాకేశ్ కుటుంబ సభ్యులపై కత్తితో ఎందుకు దాడికి పాల్పడ్డాడో కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.