నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆసిమా సుల్తానా విజయం సాధించింది. ఉప ఎన్నికలో 436 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2020లో జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక కాంతమ్మ నెల రోజులకే మృతి చెందారు. దీంతో ఈ వార్డుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి ఆసిమా సుల్తానా, బీజేపీ నుంచి దాసరి మహేశ్వరి, ఎంఐఎం నుంచి గౌసీయాబేగం, కాంగ్రెస్ నుంచి దుబ్బ రవళి ఎన్నికల బరిలో పోటీపడ్డారు. ఉపఎన్నికలో విజయం ఆసిమా సుల్తానాను వరించింది.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికలతో పాటుగా నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్పల్లి, జల్పల్లి, గజ్వేల్లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.