బాలీవుడ్లో బహుముఖప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్నది కంగనా రనౌత్. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా, రచయిత్రిగా సత్తాచాటిన ఆమె తాజాగా నిర్మాతగా అరంగేట్రం చేయబోతున్నది. మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో స్వీయనిర్మాణ సంస్థను స్థాపించిన కంగనా రనౌత్ బ్యానర్లోగోను శనివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. తన నిర్మాణ సంస్థపై తొలి ప్రయత్నంగా ‘టికు వెడ్స్ షేరు’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. డార్క్ హ్యూమర్ సెటైరికల్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్పింది. ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ కోసమే నిర్మించబోతున్నట్లు వెల్లడించింది కంగనా రనౌత్. ఈ సినిమా ద్వారా కంగనా డిజిటల్లోకి అడుగుపెట్టబోతున్నది. నూతన తారాగణంతో రూపొందనున్న ఈసినిమాకు కంగనా రనౌత్ స్వయంగా కథను అందించనున్నట్లు సమాచారం.