మహేష్బాబు-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. పదకొండేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సూపర్స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేయనున్నారు. మహేష్బాబు 28వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి సమర్పణ: మమత, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.