లోన్ యాప్లకు సంబంధించిన కేసులో ఒక సంస్థకు అదనపు డైరెక్టర్గా వ్యవహరించిన బెంగళూర్కు చెందిన కాలప్పను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా జాతీయుడైన శాన్ టాగో బెంగళూర్లో పిన్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ సంస్థను ఏర్పాటు చేశాడు. విదేశీ కంపెనీలలో స్థానికులు కూడా డైరెక్టర్లుగా ఉండాలనే సాంకేతిక పరమైన నిబంధనల మేరకు స్థానికులైన తుషార్తో పాటు మరికొందరిని డమ్మీ డైరెక్టర్లుగా నియమించాడు. ఆ సంస్థలో కాలప్ప ఉద్యోగిగా చేరాడు. అయితే అందులో ఒక అదనపు డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో కాలప్పకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే లోన్ యాప్ల వేధింపులపై హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, బెంగళూర్లో లోన్యాప్లకు సంబంధించిన కాల్సెంటర్లపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న కాలప్పను సైబర్క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం అరెస్ట్ చేసి నగరానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.