కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 25 : కరోనాతో ప్రపంచమంతా పోరాడుతున్న తరుణంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కేంద్రం తీసుకోలేని నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఉచితంగా టీకా పంపిణీపై దేశానికే ఆదర్శమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అపార భగీరథుడిలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఒడిశా నుంచి అందాల్సిన ఆక్సిజన్ను త్వరగా రాష్ర్టానికి చేర్చేందుకు దేశంలోనే తొలిసారిగా సైనిక రవాణా విమానాల సేవలను ప్రభుత్వం వినియోగించుకుందన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వయస్సుతో సంబంధం లేకుండా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని రూ. 2,500 కోట్ల ఖర్చు ఖర్చు చేసి ప్రజల ప్రాణాలే ముఖ్యమని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎనలేని సహసమన్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరినీ కరోనా నుంచి రక్షించుకునేందుకు ప్రభు త్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉంటూ మాస్కులను ధరించి, భౌతికదూరాన్ని పాటిస్తూ కరోనాను తరిమికొట్టేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.