వరంగల్ అర్బన్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి బోగస్ ప్రచారమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు టీఆర్ఎస్ పెద్దపీట వేసిందన్నారు. అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు.
జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. వరంగల్ పట్టణ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలలని విజ్ఞప్తి చేశారు. కరోన సమయంలో, వరదలు సంభవించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వరంగల్ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విదంగా మేము చేస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండపడ్డారు.
ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని మంత్రి కోరారు. ప్రస్తుతం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే పరిస్థితి లేదు. మమ్ములను నమ్మండి, అభివృద్ధి చేసే భాద్యత మాదని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు.
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇంజక్షన్ లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ లు చాలా తక్కువ స్థాయిలో కేంద్రం ఇస్తుందన్నారు.
సమావేశంలో పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాల మల్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన