న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వచ్చే మూడు వారాలు చాలా కీలకం అని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.
కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పోలీసు అధికారులతో నీతిఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే మూడు వారాల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్నందున ముందే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాజిటివ్ కేసులు గుర్తించేందుకు నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
దేశంలో కొవిడ్ 19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితర ఉన్నతాధికారులతో ‘దేశంలో కరోనా విజృంభణ’ అంశంపై వీకే పాల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా తీవ్రతకు అనుగుణంగా దవాఖానలను పునరుద్ధరించాలని, ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది.
ఇప్పటికే తాము తీసుకున్న చర్యలను వీకే పాల్కు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వివరించారు. జనసంచారాన్ని తగ్గించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు.
ఇంటింటి ప్రచారం చేస్తూ వైరస్పై అవగాహన కల్పిస్తున్నామని, వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని తెలిపారు. దాదాపు 90 శాతానికి పైగా ప్రజలకు హోం ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు