గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్లోని షీత్లా కాలనీలో ఉన్న మురికిడాలోని ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవి క్రమంగా పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. దీంతో మురికివాడలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..