న్యూఢిల్లీ : భారతదేశం, చైనా మధ్య 11 వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు రేపు జరుగనున్నాయి. ఈసారి చర్చలను భారత్ వైపు ఉన్న లడఖ్లో నిర్వహించనున్నారు. ప్యాగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి చైనా దళాలను వెనక్కిపంపిన తరువాత.. గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ మైదానాల్లోని ఘర్షణ పాయింట్ల నుంచి కూడా వెనక్కి వెళ్లడం గురించి ఇరు దేశాల కమాండర్లు చర్చించనున్నారు.
‘భారత్-చైనీస్ సైన్యం 11 వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు తూర్పు లడఖ్లోని చుషుల్ వద్ద నిర్వహించనున్నారు. అక్కడ ఘర్షణ పాయింట్ల నుంచి వెనక్కి వెళ్లడం గురించి చర్చించనున్నారు’ అని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
సైనిక,రాజకీయ స్థాయిలో విస్తృతమైన చర్చల తరువాత గత నెలలో అత్యంత వివాదాస్పదమైన ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాల దళాలు వెనక్కి వెళ్లిపోయాయి.ఈ క్రెడిట్ అంతా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే కు చెందింది. సంక్షోభ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ ఇచ్చిన ఇన్పుట్ల నుంచి దేశం లబ్ది పొందడం గురించి నారవనే మాట్లాడారు.
అంతకుముందు, భారతదేశం-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో 10 రౌండ్ల చర్చలు జరిపి.. ప్యాంగాగ్ సరస్సు ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిపోయేలా ఒప్పందం చేసుకున్నాయి.
ఇరుదేశాల మధ్య 10 వ రౌండ్ చర్చలు చైనా వైపు ఉన్న మోల్డో / చుషుల్ సరిహద్దు సమావేశ స్థలంలో జరిగాయి. ఎల్ఏసీ వెంట మిగిలిన ఇతర సమస్యల పరిష్కారానికి ఈ చర్చలు మంచి ముందడుగుగా ఇరు దేశౠల భద్రతాబలగాలు పేర్కొంటున్నాయి.
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
కొవిడ్కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాజేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..