న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడం కలకలం రేపింది. నగరంలోని పంజాబి బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం మంగళవారం నేలకొరిగింది.
శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకుపోగా అతడిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.