దక్షిణ మధ్య రైల్వే 2020-21 సంవత్సరంలో మొత్తం 750 కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర కలిపి మొత్తం 182 కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరించారు. నూతన సెక్షన్లలో 612కిలోమీటర్ల వరకు ట్రాక్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్రకు సంబంధించిన ఐదు రైలు మార్గాల్లో కలిపి దాదాపు 164.09కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. తెలంగాణలో లింగంపేట – జగిత్యాల-మోర్తాడ్ మధ్య 50.50 కిలోమీటర్లు, వికారాబాద్-కోహిర్ మధ్య 44.82 కిలోమీటర్లు, మేడ్చల్-మనోహరాబాద్ మధ్య 13.08కిలోమీటర్లు, ఫలక్నుమా-ఉందానగర్ మధ్య 13.69 కిలోమీటర్లు, రాఘవాపురం-కోలనూర్ మధ్య 30కిలోమీటర్లు, కోలనూర్-పోటాకపల్లి మధ్య 12 కిలోమీటర్ల చొప్పున ట్రాక్ల విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రకటించారు. ట్రాక్ల విద్యుదీకరణతో ట్రాక్షన్ ఇంజిన్ అనుసంధాన ప్రక్రియలో పట్టే సమయాన్ని తగ్గించి రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుందన్నారు.