హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సూర్యుడినుంచి దూసుకొచ్చే ప్రాణాంతక అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై మానవాళి రక్షణ ఇస్తున్న ఓజోన్ పొర మన హైదరాబాద్ మహానగరంపై మరింత మందంగా కప్పుకున్నది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో కాలుష్యం భారీగా తగ్గి ఓజోన్ పొర భారీగా పెరిగిందని నగరంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనంలో తేలింది.
లాక్డౌన్కు ముందు హైదరాబాద్పై ఓజోన్ పరిమాణం 26 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) ఉండగా, లాక్డౌన్ తర్వాత 56.4 పీపీబీకి పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. అంటే ఓజోన్ పరిమాణం ఏకంగా 115 శాతం పెరిగింది. లాక్డౌన్ వల్ల జనసంచారంతోపాటు వాహనాలు, పరిశ్రమలన్నీ మూతపడటంతో కాలుష్యం తగ్గింది.
ఆ సమయంలో గాలిలోకి ప్రమాదకర నైట్రోజన్ డైఆక్సెడ్ 33.7 శాతం, నైట్రోజన్ ఆైక్సెడ్ 53.8 శాతం, కార్బన్ మోనాైక్సెడ్ 27.25 శాతం వాయువుల విడుదల తగ్గింది. లాక్డౌన్ ముందు, తర్వాత కాలుష్యం ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 2018, 2019 వాతావరణ పరిస్థితులను గతేడాది లాక్డౌన్ విధించిన నెలలతో పోల్చి చూశారు. కార్బన్ డై యాక్సెడ్, నైట్రోజన్ ఆైక్సెడ్స్, ఓజోన్ వాయువులను పరిశీలించారు. ఉష్ణోగ్రత, సాంద్రత, సోలార్ రేడియేషన్ వంటివాటిని పరిగణనలోకి తీసుకొని ఓ నివేదికను రూపొందించారు.
లాక్డౌన్ వల్ల గాలి కాలుష్యం తగ్గటంతో ఓజోన్ పొర పరిమాణం పెరిగిందని తేల్చారు. ఈ పరిశోధన వివరాలు ఎన్విరాన్మెంట్ ప్రాససెస్ అనే సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సారత్ కుమార్ అల్లు, అపర్ణారెడ్డి, శైలజా శ్రీనివాసన్, ఎం రామక్రిష్ణ, గంగాగ్నిరావు, అనుపోజు తదితరులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. వ్యక్తి అరెస్టు
లాటరీ మెసేజ్ వచ్చిందా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి