ఉత్సాహంగా స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాల్గొన్న కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు
మంచిర్యాల అర్బన్, మార్చి 24 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవారం ఫ్రీడం రన్ కొనసాగింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాలు’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారిని మననం చేసుకోవాలనే ఉద్దేశంతోనే 2కే రన్ నిర్వహించామన్నారు.
‘స్వాతంత్య్ర భారత అ మృత మహోత్సవాల్లో’ భాగం గా బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన ఫ్రీడం రన్ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భారతీ హోళికేరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం వ చ్చింద న్నారు. వారి త్యాగాల ను స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్రీడం రన్ను నిర్వహించామని తెలిపారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ప్రధాన రహదారి గుండా బెల్లంపల్లి చౌరస్తా మీదుగా జడ్పీ బాలుర పాఠశాల మైదానం వరకు సా గింది. అనంతరం కలెక్టర్ భారతీ హోళికేరి, విద్యార్థు ల కర్రసాము అలరించింది. కార్యక్రమంలో డీసీపీ ఉ దయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో సురేశ్, ఆర్డీవో శ్యామలాదేవి, డీఎస్డీవో శ్రీకాంత్ రెడ్డి, డీడబ్ల్యూవో రౌఫ్ఖాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, మార్చి 24 : జిల్లా కేంద్రంలో ఫ్రీడం రన్ను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జన్కాపూర్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, మార్కెట్ ఏరియా, వివేకానంద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా కుమ్రం భీం చౌక్ వరకు రన్ కొనసాగింది. మార్గమధ్యంలో అంబేద్కర్ విగ్రహానికి, కుమ్రం భీం విగ్రహానికి నివాళులర్పించారు. జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, సీఐ అశోక్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.