మంచిర్యాల, మార్చి 8(నమస్తే తెలంగాణ):జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణ డే అండ్ నైట్ ఉంటుంది. దేశ విదేశాల్లోని నగరాల్లో భారీ జనసందోహం మధ్య పగలుతోపాటు రాత్రిపూట జిగేల్మనే ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయి. ఇటువంటి ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆరు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రథమంగా బాల్క ఫౌండేషన్ క్రికెట్ పోటీలు నిర్వహించింది. దీనికి మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానం వేదికయ్యింది. ఇప్పటివరకు టీవీల్లో చూడడమే తప్పా క్రీడాకారులకు ఆడే అవకాశం రావడంతో తమ సంతోషానికి అవధుల్లేవు. ఈ పోటీల్లో 12 జట్లు పాల్గొనగా.. ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎడ్యుకేషన్ జట్టుపై మున్సిపల్ సిబ్బంది టీం విజయకేతనం ఎగురవేసింది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఆరు రోజులు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. ఈనెల 2న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన పోటీలు ఆదివారం అర్ధరాత్రి ముగిశాయి. హైదరాబాద్, సిద్దిపేట వంటి పెద్దపెద్ద పట్టణాల్లో మాత్రమే రాత్రిపూట జరిగే పోటీలు మారుమూల ని యోజకవర్గకేంద్రం చెన్నూర్లోనూ నిర్వహించడంతో క్రీడాకారుల ఆనందానికి అవధులు లేవు. వివిధ రంగాల్లో విధు లు నిర్వహిస్తున్న వారంతా ఒకే చోట చేరి ఆడడంతో సత్సంబంధాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక శ్రద్ధతో మున్సిపల్ కమిషనర్ మొహియొద్దీన్, సిబ్బంది, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
క్రీడాకారులందరినీ ఒకే చోటికి చేర్చడంతో పాటు అన్ని విభాగాల వారికి రిఫ్రెష్మెంట్ కోసం క్రికెట్ పోటీలను నిర్వహించినట్లు బాల్క ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని క్రీడామైదానంలో స్తంభానికి 12 లైట్ల చొప్పున గ్రౌండ్కు ఇరువైపులా నాలుగు చోట్ల మొత్తం 48 విద్యుద్దీపాలను అమర్చారు. ఆరు బల్బుల చొప్పున రెండు వైపులా ఏర్పాటు చేశారు. ఒక్కో బల్బు 200 వాట్స్ సామర్థ్యంతో 60 దీపాల కాంతుల్లో పగటిని తలపించేలా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు టీవీల్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా చూడకపోవడంతో చెన్నూర్తోపాటు చు ట్టు పక్కలా మండలాల నుంచి ప్రజలు, క్రీడాకారులు తరలివచ్చారు. రాత్రి 7 అయితే నిర్మానుష్యంగా కనిపించే ప్ర భుత్వ ఉన్నత పాఠశాల మైదానం రాత్రి 11 గంటల వరకూ సందడిగా కనిపించింది.
12 జట్లు.. విజేత మున్సిపల్ సిబ్బంది టీం..
ఆరు రోజులుగా కొనసాగిన ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. ఎడ్యుకేషన్, మెడికల్ హెల్త్, మున్సిపల్ కౌన్సిలర్స్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఎల్ఐసీ, కోటపల్లి పంచాయతీ రాజ్ విభాగం, మీడియా, మున్సిపల్ సిబ్బం ది, పోలీస్, బ్యాంక్, రెవెన్యూ, పోస్టాఫీస్ జట్లు పాల్గొన్నా యి. రాత్రి 6 గంటల తర్వాత 12 ఓవర్ల చొప్పున రోజుకు రెండు మ్యాచ్లు నిర్వహించారు. కాగా, ఫైనల్లో మున్సిప ల్ సిబ్బంది, ఎడ్యుకేషన్ జట్లు తలపడగా మున్సిపల్ స్టాఫ్ టీం విజేతగా నిలిచింది. మున్సిపల్ జట్టులోని మనోజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ను కైవసం చేసుకున్నాడు. విజేతలకు ఏసీపీ నరేందర్, సీఐలు ప్రమోద్కుమార్, నాగరాజు, ఎస్ఐ శివకుమార్, మున్సిపల్ చైర్ పర్స న్ అర్చన గిల్డా, డాక్టర్ సత్యనారాయణ, బ్యాంక్ మేనేజర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ కారెంగుల రామయ్య, కమిషనర్ మొహియొద్దీన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
సత్సంబంధాలు కొనసాగించేందుకే.. : ఏసీపీ నరేందర్
క్రీడా పోటీల బహుమతుల ప్రదానానికి ముఖ్యఅతిథిగా హా జరైన జైపూర్ ఏసీపీ నరేందర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ విభాగాల్లోని ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు క్రీడలు దోహద పడతాయన్నారు. విప్ సుమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే ఇంతటి కార్యక్రమం నిర్వహణ సాధ్యమైందన్నారు. చెన్నూర్లో ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు, బాల్క ఫౌండేషన్ సభ్యులు, నిర్వాహకులకు, మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, క్రీడా స్ఫూర్తితో ఆడి పలువురి మన్ననలు పొందారని కొనియాడారు.