న్యూఢిల్లీ: నెంబర్ప్లేట్లేని బైక్పై వెళ్తున్న ఇద్దరు దుండగులను ఓ కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే వాళ్ల బైక్ను ఆపేందుకు ప్రయత్నించగా ఆపలేదు. దాంతో కానిస్టేబుల్ తన బైక్పై వాళ్లను చేజ్ చేశాడు. చేజ్ చేస్తూనే ఫోన్లో తోటి కానిస్టేబుల్కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఇద్దరు కలిసి వెంబడిస్తుండగా దుండగులు వారిపై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారు. అయినా కానిస్టేబుల్లు బెదరకుండా వారిని పట్టుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ఏరియాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్ నవీన్ దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ఏరియాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి పోలీస్స్టేషన్కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్లేని బైక్పై వెళ్తూ కనిపించారు. దాంతో నవీన్ వాళ్లను ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోయారు. దాంతో నవీన్ తన బైక్పై వాళ్లను వెంబడించాడు. వెళ్తూనే తోటి కానిస్టేబుల్ మనీశ్కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు.
ఇద్దరూ కలిసి నిందితులను చేజ్ చేస్తుండగా నిందితుల్లో ఒకడు వారిపై పిస్తల్తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ నవీన్ కాలుకు తీవ్రగాయమైంది. ఆయన విడిచిపెట్టకుండా కానిస్టేబుల్లు ఇద్దరూ వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి పిస్తల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కానిస్టేబుల్ల తెగువను దక్షిణ ఢిల్లీ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ అభినందించారు.