ముంబై: రన్ రాజా రన్ చిత్రంతో డైరెక్టర్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు సుజిత్. ప్రభాస్తో తెరకెక్కించిన సాహో చిత్రంతో ఇండియావైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు వెర్షన్ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా హిందీ వెర్షన్ మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా సుజీత్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. సుజీత్ ప్రస్తుతం జీస్టూడియోస్ తో కలిసి హిందీ చిత్రాన్ని చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
పాపులర్ హీరో ఈ ప్రాజెక్టులో నటిస్తాడని టాక్. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్కు సుజీత్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో స్టోరీ వినిపించినట్టు ఇన్సైడ్ టాక్. ఇటీవలే తన స్నేహితురాలిని పెండ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సుజీత్ ముంబైకి మకాం మార్చాడట. మొత్తానికి తీసింది ఒకటి రెండు సినిమాలే అయినా సుజీత్ చాలా కాన్ఫిడెంట్గా ఇక బాలీవుడ్పై తన ఫోకస్ పెట్టబోతున్నట్టు బీటౌన్లో వార్త చక్కర్లు కొడుతోంది.
అర్జున్ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముంబైకి షిప్ట్ అయ్యాడు. సందీప్ రెడ్డి తర్వాత ముంబైకి మకాం మార్చిన రెండో డైరెక్టర్ సుజీత్ కావడం విశేషం.