మంత్రి సత్యవతి రాథోడ్
ములుగుటౌన్, జూలై 16 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. శుక్రవారం కలెక్టరేట్లో శిశు సంక్షేమ శాఖ, ‘సేవ్ ద చిల్డ్రన్’ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ప్రీ స్కూల్, బాలల సహాయ కిట్లు, దివ్యాంగుల ఆర్థిక పునరావాస పథకాల కింద అర్హులకు సహాయ కిట్లు, పునరావాస చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన 214 మంది పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉం దని గర్వంగా చెప్పుకునేలా బాసటగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, జడ్పీ చైర్మన్ జగదీశ్వర్, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రేమలత, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బుచ్చయ్య పాల్గొన్నారు.