పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్సాబ్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బోనీకపూర్ సమర్పణలో దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. శృతిహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను ఈ నెల 29న విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ను విడుదలచేసింది. ఇందులో లాయర్ గెటప్లో శక్తివంతంగా పవన్కల్యాణ్ కనిపిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘న్యాయాన్ని గెలిపించే ఓ లాయర్ కథ ఇది. ముగ్గురు అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై ఆ లాయర్ ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ వాటిని మరింత పెంచుతుంది. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, సహనిర్మాత: హర్షిత్రెడ్డి.