చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్ ఆమని పేరు ఇండస్ట్రీలో మళ్లీ ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడమే. మొన్న విడుదలైన శర్వానంద్ శ్రీకారంలో హీరో తల్లి పాత్రలో నటించింది. ఇప్పుడు చావు కబురు చల్లగా సినిమాలో కూడా హీరోకు తల్లిగా నటించింది ఆమని. అలాగే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లోనూ హీరో తల్లిగా నటిస్తుంది. ఈమెకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. క్లాస్ ఇమేజ్ ఉంది. 90ల్లో ఈమె చేసిన సినిమాలన్నీ హోమ్లీ పాత్రలే. ఒకప్పుడు ఈమె చేసిన గడసరి పెళ్లాం పాత్రలు ఇప్పటికీ ఫేమస్సే.
దాంతో పాటు అల్లరి పాత్రలకు కూడా ఈమె పెట్టింది పేరు. అప్పట్లో హీరో జగపతిబాబు కాంబినేషన్లో ఆమని చేసిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శుభలగ్నంలో మొగున్ని అమ్ముకునే మొండి పాత్రలో అయినా.. మావిచిగురులో అదే భర్తపై చచ్చేంత ప్రేమ ఉన్న గడసరి పెళ్లాంగా అయినా అన్నింట్లోనూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమని. మిస్టర్ పెళ్లాం లాంటి సినిమాల్లో కథ మొత్తం ఈమెపైనే నడిపించాడు దర్శకుడు బాపు. హోమ్లీ రోల్స్ చేయడంలో ఆమెకు తిరుగులేదు. కానీ ఈ వయసులో బోల్డ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. దానికి సిద్ధమై అలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఆమని.
ఇప్పటికే చావు కబురు చల్లగా సినిమాలో చాలా మాస్ క్యారెక్టర్ చేసింది ఈమె. ఇక ఇప్పుడు జగపతి బాబు హీరోగా ఆహాలో ఒక వెబ్ సిరీస్ చేయబోతుంది. ఇది చాలా హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది. ఇందులో చాలా బోల్డ్ క్యారెక్టర్లో ఆమని నటించబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా తనే కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే జగపతిబాబుతో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను అంటూ చావు కబురు చల్లగా ప్రమోషన్ ఈవెంట్లో తెలిపింది. ఆమని ఒకప్పుడు హోమ్లీ క్యారెక్టర్స్తో ఆకట్టుకున్న ఈమెను ఇలాంటి బోల్డ్ పాత్రల్లో ప్రేక్షకులు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. అన్నట్టు ఆమధ్య చందమామ కథలు సినిమాలో సీనియర్ నరేష్తో లిప్ లాక్ సీన్ కూడా చేసింది ఆమని. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేయడంలో తప్పేం లేదు అంటుంది ఈమె.