బెంగళూర్ : కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అనంతరం బెయిల్పై ఇటీవల విడుదలైన నటి రాగిణి ద్వివేది వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. కర్వ-3 ప్రాజెక్టుపై ఇప్పటికే సంతకం చేసిన కన్నడ భామ తాజాగా జానీ వాకర్ అనే మూవీలో ఆన్స్క్రీన్పై మెరువనున్నారు. ముఫ్తీ మూవీని తెరకెక్కించిన వేదిక్ నిర్ధేశకత్వంలో జానీ వాకర్ రూపొందనుంది.
ప్రేక్షకులను థ్రిల్కు గురిచేసే కథాంశంతో ఈ సినిమా పలు భాషల్లో నిర్మితమవుతోంది. ఈ మూవీలో రాగిణి మరోసారి పోలీస్ అధికారిగా ప్రేక్షకులను మెప్పించనున్నారు. పోలీస్ అధికారిగా నటించడం తనకు ఎప్పటికీ ఆసక్తికరమేనని కన్నడ భామ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసు అనంతరం బెయిల్పై బయటకు వచ్చినప్పటి నుంచి రాగిణి ద్వివేదికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని అయితే ఆమె సెలెక్టివ్గా ఆయా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.