ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు. మూడేళ్లకు ఓ సినిమా చేయడానికి కూడా కష్టం అయిపోయిందిప్పుడు. టాలీవుడ్లో ఒకప్పుడు బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ అనుష్క అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు. అయినా ఇది ఆమె తప్పు కూడా కాదు. ఎందుకంటే మెడిసిన్కు కూడా ఏదో ఓ రోజు ఎక్స్పైరీ ఉంటుందని ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు.. అనుష్క పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. కొన్నేళ్ల కిందటి వరకు వరస సినిమాలతో దుమ్ము దులిపేసిన జేజమ్మ.. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోయింది. అవకాశాలు కూడా రావడం లేదు.
‘బాహుబలి’ తర్వాత సినిమాలు ఒప్పుకోవడం కూడా లేదు స్వీటీ. ‘భాగమతి’ సినిమా చేసినా కూడా అది ఎప్పుడో ఒప్పుకున్నది. గతేడాది ‘నిశ్శబ్ధం’ సినిమాతో వచ్చింది జేజమ్మ. అయితే ఈ సినిమా వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. అంతపెద్ద డిజాస్టర్ అయింది ‘నిశ్శబ్ధం’. టైటిల్ కు తగ్గట్లుగానే సైలెంట్ గా వచ్చెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు అనుష్క కెరీర్ డైలమాలో పడింది. పైగా ఆమె వయసు కూడా 40కి చేరువైంది. దాంతో స్టార్ హీరోలు ఆమె పక్కన నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. కుర్ర హీరోలకు సరిపోయే ఫిజిక్ కాదు ఈమెది. అందుకే అవకాశాల కోసం చూస్తుంది. ఒకానొక సమయంలో అనుష్క సినిమాలకు బాగానే మార్కెట్ ఉన్నా ఇప్పుడు మాత్రం అంత సీన్ లేదు.
వరస పరాజయాలతో జేజమ్మ మార్కెట్ దారుణంగా పడిపోయింది. మొన్నటికి మొన్న ‘నిశ్శబ్ధం’ సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్కు దాదాపు రూ.15 కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈమె యువీ క్రియేషన్స్ బ్యానర్లో ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేష్తో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాలో కుర్ర హీరో నవీన్ పొలిశెట్టితో ఈమె నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు మహేష్ కథ కూడా అలాంటిదే రాసుకున్నట్లు తెలుస్తుంది. ఎక్కువ వయసున్న అమ్మాయి.. తక్కువ ఏజ్ ఉన్న అబ్బాయి మధ్య జరిగే కథ ఈ సినిమా అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వరస సినిమాలతో సంచలనం రేపుతున్న నవీన్ అయితే ఈ కథకు బాగుంటాడని యువీ క్రియేషన్స్ కూడా భావించడంతో ఈయన్నే తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!