తెలుగు ఇండస్ట్రీకి మరో విజయం వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సంచలన విజయం దిశగా అడుగులేస్తుంది. ఈ సినిమా రెండో రోజు కూడా అదిరిపోయే వసూళ్లు సాధించింది. దీని దూకుడు చూస్తుంటే కచ్చితంగా వీకెండ్ అయ్యేలోపు రూ.20 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రూ.12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన జాతిరత్నాలు రెండు రోజుల్లోనే దాదాపు 70 శాతం వసూళ్లు తీసుకొచ్చింది. మూడో రోజు కూడా హౌజ్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. లాజిక్ లేని మ్యాజిక్ అంటూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు.
నైజాం – 3.41 కోట్లు
సీడెడ్ – 92.5 లక్షలు
నెల్లూరు – 18.8 లక్షలు
కృష్ణ – 45.2 లక్షలు
గుంటూరు – 62.3 లక్షలు
వైజాగ్ – 96 లక్షలు
ఈస్ట్ – 47.7 లక్షలు
వెస్ట్ – 43.8 లక్షలు