కొన్నిసార్లు అంతే.. కేవలం నిర్మాత పేరు చూసి బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు షాదీ ముబారక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. చక్రవాకం, మొగలిరేకులు లాంటి సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు సాగర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. వారం రోజుల క్రితం వరకు ఈ సినిమా వస్తున్నట్లు కూడా ఎవరికి తెలియదు. కానీ దిల్ రాజు నిర్మాత అని తెలియగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. నిజానికి ఈ సినిమా దిల్ రాజు నిర్మించలేదు.. సినిమా పూర్తయిన తర్వాత మొత్తానికి కొని విడుదల చేస్తున్నాడు. ఓ రకంగా దిల్ రాజు పేరు చెప్పి ఈ సినిమాను అమ్మేశారు. దృష్యా రఘనాథ్ ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతుంది. పద్మశ్రీ అనే కొత్త దర్శకుడు ‘షాదీ ముబారక్’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది. మార్చి 5న ఈ సినిమా విడుదల అవుతుంది. తాజాగా ఈ చిత్రానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. ఏరియా వైజ్ గా బిజినెస్ ఇలా జరిగింది..
నైజాం- 0.80 కోట్లు
సీడెడ్- 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.20 కోట్లు
ఏపీ+తెలంగాణ (టోటల్)- 2.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.15 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 2.55 కోట్లు
‘షాదీ ముబారక్’ సినిమా తెరకెక్కిన విధానం చూస్తే.. రూ.2.55 కోట్ల బిజినెస్ జరగడం పెద్ద విషయమే. ఈ సినిమా విజయం సాధించాలంటే కనీసం మూడు కోట్ల షేర్ తీసుకురావాలి. దిల్ రాజు బ్రాండ్ వుండటంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు వస్తాయనడంలో సందేహం లేదు.