తెలుగు ఇండస్ట్రీలో అల్లు శిరీష్కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈయన సినిమాల కంటే కూడా కెరీర్ను మరో రకంగా డిజైన్ చేసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్గా మారుతున్నాడు. ఈ మాట అనడానికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే అల్లు శిరీష్ చేస్తున్న పనులు చూస్తుంటే ఆయన ట్రెండ్ సెట్టర్ అనాల్సి వస్తుంది.
ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేశాడు అల్లు శిరీష్. IIFA, ఫిలిం ఫేర్, SIIMA ఇలాంటి పెద్ద పెద్ద అవార్డు ఫంక్షన్లకు హోస్టింగ్ చేశాడు.యూ ట్యూబ్లో ఇప్పటికీ కొందరు అభిమానులు ఈ అవార్డు ఫంక్షన్లకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ చూస్తుంటారు. టిక్ టాక్లో మిలియన్ల ఫాలోవర్స్ దక్కించుకున్న తక్కువ మంది హీరోల్లో శిరీష్ కూడా ఉన్నాడు.
ఇక ఇప్పుడు హిందీ సింగిల్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. విలయతి సాహెబ్ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్స్ దర్శన్ రావల్, నీతి మోహన్ పాడారు. యూ ట్యూబ్లో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
భాష అనేది ఎప్పుడు అల్లు శిరీష్కు ఒక గోడలా నిలవలేదు. ఈయన మలయాళంలోనూ నటించాడు. 1971 బియాండ్ బోర్డర్స్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్లో నటిస్తున్నాడు. దీని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
సినిమాలు మాత్రమే కాకుండా ఫిట్నెస్, హెల్త్ గురించి కూడా అల్లు శిరీష్ ఆసక్తి చూపిస్తాడు. ఈ మధ్య బరువు తగ్గి స్లిమ్ లుక్లో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో అవి బాగా వైరల్ అయ్యాయి. కొత్త కొత్త స్టైల్స్ ఫాలో కావడంలోనూ అల్లు శిరీష్ది ప్రత్యేకమైన శైలి.
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పుష్ప విలన్ పారితోషికం వింటే షాకే..!
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు
కరోనా రెండో దశ వచ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
పవన్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్
అమాంతం రేటు పెంచిన జాతిరత్నం.. పర్లేదు అంటున్న నిర్మాతలు