వినాయక్నగర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్లో నివసించే సదానంద్(28) ప్రైవేటుఉద్యోగిగా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి ఇంట్లో విద్యుత్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.