కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 28 : యాదాద్రి ఆలయం అద్భుతమని, ఆలయాలకు పునర్వైభవం తెస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం యాదగిరి లక్ష్మీనర్సింహ్మస్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పురాతన చరిత్ర కలిగిన యాదగిరి లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయాన్ని భూలోక స్వర్గంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్దన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని..యాగాలు చేస్తూ ఆలయాలకు పునర్వైభవం తీసుకొస్తున్నారన్నారు.
ఇలాంటి ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉంటుందని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.