మేడ్చల్: జిల్లాలో దారుణ హత్య జరిగింది. శామీర్పేట మండలం లాల్గడి మలక్పేట సమీపంలో వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. పొలంపల్లి లక్ష్మి అనే మహిళను మలక్పేట శివార్లలో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనంలోకి తీసుకొచ్చి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్మం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు కోసమే ఆమెను హత్యచేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి