బాలానగర్, అక్టోబర్ 24 : పక్షవాతంతో బాధపడుతున్న మహిళ అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం..బాలానగర్ డివిజన్ పరిధి చెరబండరాజు కాలనీకి చెందిన కన్నెమైన లక్ష్మి (60) గత కొంత కాలంగా పక్షవాతంతో బాదపడుతుంది.
రోజు మాదిరిగానే శనివారం ఇంటి వద్ద ఉదయం 11.30 గంటలకు తనకు కోడలు స్నానం చేయించింది. కాసేపు ఎండలో కూర్చుంటానని కోడలుకు తెలిపింది. కాసేపటికి కోడలు ఇంటి బయటకు వచ్చి చూడగా అత్త లక్ష్మి కనిపించలేదు. దీంతో కంగారుపడి ఇంటి చుట్టుపక్కల, బంధువుల వద్ద, పరిసర ప్రాంతాలలో గాంలించినా ఫలితం లేకపోవడం ఆదివారం కుమారుడు కన్నెమైన మల్లేష్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. లక్ష్మి ఎత్తు 5.5 అడుగులు ఉంటుంది. కోలముఖం, ప్రస్తుతం పక్షవాతం కారణంగా మాట్లాడలేదు. నీలంరంగు చీర, తెల్లని జాకెట్ ధరించి ఉంది. ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తే బాలానగర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.