మేడ్చల్, మార్చి 21. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ యువజన నాయకులు మోనార్క్, విక్రం, వెంకట్రెడ్డి, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీల అభ్యర్థుల విజయం పట్ల మండల పరిధి…కాచవానిసింగారం గ్రామంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు తినిపించుకున్నారు. సర్పంచ్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, మూసీ శంకర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి గెలిచిన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మూడుచింతల్పల్లి ప్రధాన చౌరస్తాలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి చిత్తాగౌడ్, సర్పంచ్ జామ్ రవి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వీరారెడ్డి విగ్రహానికి నివాళులర్పించి టపాసులు పేల్చారు. అలాగే పొన్నాల్ గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలు నిర్వహించారు. సర్పంచ్లు సింగం ఆంజనేయులు, విష్ణువర్ధన్రెడ్డి, ఇస్తారి, కో ఆప్షన్ సభ్యుడు నాయకులు పాల్గొన్నారు.
మంత్రి నివాసంలో..
కీసర, మార్చి 21 : ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభీ వాణీదేవి విజయం సాధించడం పట్ల కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కీసర మండల నేతలంతా కలిసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాణీదేవి భారీ మెజార్టీతో గెలుపొందడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ ఇందిర, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, సర్పంచులు ఆండాలుమల్లేశ్, ధర్మేందర్, ఎంపీటీసీ శశికాంత్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.