దుండిగల్,నవంబర్10 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలనీల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రాబోయే రోజుల్లో ఆదర్శంవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
బుధవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 18వ వార్డు డివిజన్లో శ్రీహోమ్స్ కాలనీ, నర్సింహా లే-అవుట్, ఎస్జేబి హిల్స్లో నెలకొన్న స్థానిక సమస్యలను సందర్శించి పరిశీలించారు. డ్రైనేజీ అవుట్లెట్ సమస్యతో పాటు సీసీరోడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామి ఇచ్చారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్ ధన్రాజ్యాదవ్, కార్పొరేటర్లు ఆగం పాండు, కాసాని సుధాకర్, బాలాజీనాయక్, సురేశ్రెడ్డి, సుజాత, నిజాంపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.