వినాయక్నగర్, ఆగస్టు: కరోనా వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలని జోనల్ కమిషనర్ మమత అన్నారు. మంగళవారం వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్ బస్తీలో మొబాయిల్ వ్యాక్సినేషన్ సెంటర్ను జోనల్ కమిషనర్, డీసీ నాగమణి పరిశీలించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ బస్తీలు , కాలనీల ప్రజలకు ఇంటి దగ్గరలో వ్యాక్సినేషన్ అందుబాటులో పెట్టామని అన్నారు.
వ్యాక్సినేషన్ పట్ల అపోహలు వద్దని, వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి కరోనా వ్యాధి రాకుండా రక్షణ శక్తి ఉంటుందని అన్నారు. ప్రతి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఏంహెచ్ఓ డాక్టర్ నిర్మల, ఈఈ రాజు, డీఈలు మహేశ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.