కాప్రా : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వాక్సిన్ కార్యక్రమం కాప్రాసర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బికాలనీ, మల్లాపూర్, నాచారం లోని కాలనీల్లో ప్రారంభించారు. ముందుగా నిర్దేశించిన ప్రణాళికను అనుసరించి ఆయా కాలనీల్లో జీహెచ్ఎంసీ యూసీడీ, పారిశుద్ద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాక్సిన్ వేసుకోని వారి వివరాలను సేకరించారు. అనంతరం వాక్సిన్ వేసే వైద్య బృందం ఆధ్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు.