ఉప్పల్/కాప్రా, ఏప్రిల్ 17 : ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ డివిజన్కు చెందిన సురేంద్రకు రూ.60 వేలు, కృష్ణారెడ్డికి రూ.28 వేలు, హబ్సిగూడ డివిజన్కు చెందిన గాన్యనాయక్కు రూ.60 వేల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందేవారికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, గరిక సుధాకర్, గొరిగె ఐలేశ్, మేకల ముత్యంరెడ్డి, రవినాయక్, వినీశ్, నరసింహ, బాలరాజు, అలివేలు, పర్వీన్ పాల్గొన్నారు. కాప్రా డివిజన్లోని మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్కు చెందిన రాజశేఖర్కు రూ.60వేలు, ఇమ్రాన్కు రూ.14వేల చొప్పున సీఎంరిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మంజూరు కాగా సదరు చెక్కులను ఎమ్మెల్యే బేతి, హెచ్బీకాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ లబ్ధిదారులకు అందజేశారు.