ఉప్పల్, ఏప్రిల్ 15 : ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. ఉప్పల్ డివిజన్కు చెందిన వినయ్కి రూ.60 వేలు, భూమయ్యకు రూ.60 వేలు, బసంతబాయ్కి రూ.24 వేలు, అంజమ్మకు రూ.9,500లు, ఎస్.మారుతికి రూ.24వేల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఆదుకుంటున్నామని తెలియజేశారు. పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి తమవంతు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం రవికుమార్, అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, టీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చర్లపల్లి డివిజన్ కుషాయిగూడకు చెందిన అరుంధతీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీల కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అరుంధతీ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, చంద్రమౌళి, రమేశ్, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, భాస్కర్, సంతోష్రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.