ఉప్పల్, ఏప్రిల్ 14 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ స్వరూప్నగర్లోని కరిగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో సురభి ట్రస్టు గోశాలను బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవులను పూజించడం, వాటిని సంరక్షించడం అభినందనీయమన్నారు. ప్రజల అభిప్రాయాలను, ఆదర్శాలను, సంస్కృతిని గౌరవిస్తామని చెప్పారు. అనంతరం గోశాలలో గోవులకు ఆహారం అందజేసి, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్కుమార్, నేతలు అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, కృష్ణమాచారి, శ్రీనివాస్, వీరేశ్, సాయిరాజ్రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
రామంతాపూర్, ఏప్రిల్ 14 : ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు కార్యాలయం వేదిక కావాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం రామంతాపూర్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నేరుగా వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకుంటారనీ, ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికైన కార్పొరేటర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. కార్పొరేటర్ బండారు శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, నాయకులు హరీశ్, బండారు వెంకట్రావు, గడ్డం రవికుమార్, భాస్కర్, కృష్ణారెడ్డి, గడ్డం సాయికిరణ్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.