ఉప్పల్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరివరకు పోరాటం చేసిన మహాయోధుడుగా ప్రొ.జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోయారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ప్రొ.జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు ప్రొ.జయశంకర్ సార్ చిత్రపటం ఏర్పాటు చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గరిక సుధాకర్, లక్ష్మీనారాయణ, నందికంటి శివ, లింగానాయక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(ఈఎస్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాచారంలోని ఈఎస్ఐలో సోమవారం ప్రొ.జయశంకర్సార్ వర్ధంతిని నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా.కల్యాణ్, సభ్యులు డా.గంగాశంకర్, డా.రవి, డా.రజ్వంత్, డా.నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.