మల్లాపూర్, ఏప్రిల్ 3 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా కార్పొరేటర్ దేవేందర్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శనివారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో రూ. కోటి 45 లక్షలు, భవానీనగర్ కాలనీలో రూ. కోటి 98 లక్షలతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో డ్రైనేజీ సమ స్యతో పాటు స్టామ్ వాటర్ నిలువకుండా బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు. కార్పొరేటర్ దేవేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ హిల్స్, భవానీనగర్ కాలనీల్లోని ప్రజలు ఎన్నో ఏండ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులకు గురయ్యారని బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులతో సమస్య తీరనుందని తెలిపారు.
మల్లాపూర్ డివిజన్కు చెందిన పలువు7రు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను శనివారం మల్లాపూర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పంపిణీ చేశారు. శ్రీనివాస్గౌడ్కు రూ. 50 వేలు, శ్రీశైలంకు రూ. 60 వేలు, భువనేశ్వరికి రూ. 60 వేలు, అశోక్కుమార్కు రూ. 32 వేలు, మనీష్రాజ్కు రూ. 48 వేలు, సులోచన దేవికి రూ. 60 వేలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, జెర్రి పోతుల విజయభాస్కర్, శ్రవణ్, అరటికాయల భాస్కర్, సంతోష్రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.