ఉప్పల్, జూన్ 16 : వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు నాలాలు, వరదనీటి ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరదనీటి ప్రాంతాలను గుర్తించి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్తీకేయనగర్, అంబేద్కర్నగర్, న్యూఅంబేద్కర్నగర్, పటేల్కుంట చెరువు ప్రాంతాల్లో మురుగునీటి నాలాలకు వాల్ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కోటేశ్వర్రావు, ఏఈ రాకేశ్, టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చన్న, గరిక సుధాకర్, పోగుల వెంకటరమణారెడ్డి, ఎర్రం శ్రీనివాస్రెడ్డి, భూపాల్రెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ, రాంచందర్, గంగిడి కృష్ణారెడ్డి, అంజి, రఫిక్, హరిప్రసాద్, చంద్రశేఖర్, రాజేశ్, రమేశ్, అశోక్ పాల్గొన్నారు.
నాచారం రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నాచారం బాబానగర్లోని రెడ్డి శ్మశానవాటికలో వసతులు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు.
బస్తీల్లో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడ డివిజన్లోని ఉస్మానియా క్యాంపు నంబర్ 3, 4, 5 బస్తీల్లో నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈమేరకు హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్తీవాసుల నీటి సమస్యలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అలెగ్జాండర్, బస్తీవాసులు సుధాకర్, దేవయ్య, భూమయ్య, రాంచందర్, అబ్బు లు, అనిత, నర్సమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.