ఉప్పల్/కాప్రా/మల్లాపూర్/రామంతాపూర్, మే 28: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రామంతాపూర్లోని మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్లో, ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలో సూపర్ స్ప్రెడర్స్కు కరోనా టీకా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఉప్పల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కీసర ఆర్డీవో రవి, ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి తహసీల్దార్ ఎస్తేర్ అని త, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, మస్క సుధాకర్, అన్య వెంకటేశ్, వెంకట్రెడ్డి, సత్యపాల్రెడ్డి, సల్ల ప్రభాకర్రెడ్డి, శేఖర్రెడ్డి, రామకృష్ణ, భాస్కర్, అనిల్కుమార్, మురళీకృష్ణారెడ్డి, ప్రశాంత్రెడ్డి, రాఘవేందర్గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా సర్కిల్ పరిధిలో సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్కు భారీ స్పందన లభించింది. కుషాయిగూడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రారంభించారు. చర్లపల్లి, ఏఎస్రావునగర్, హెచ్బీకాలనీ డివిజన్ల కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష, ప్రభుదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్స్ప్రెడర్స్కు యుద్ధప్రాతిపదికన ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. 28, 29, 30 తేదీల్లో గ్రేటర్లో ఉన్న ఆయా విభాగాల వారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టి పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్, ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, పీవో ఇందిర, మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, టీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్రెడ్డి, నాగిళ్ల బాల్రెడ్డి, గరిక సుధాకర్, రాజేశ్వర్రెడ్డి, కుషాయిగూడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, చర్లపల్లి కాలనీలసమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, గణేశ్ ముదిరాజ్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక శిబిరంలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు 739మంది సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేసినట్టు కాప్రా సర్కిల్ అధికారులు తెలిపారు. 18-44 మధ్య వయస్సు వారు 597మంది, 45 ఏండ్లకు పైబడిన వారు 142 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్టు అధికారులు వివరించారు.
రామంతాపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు జర్నలిస్టులు టీకా వేసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో సూపర్ స్ప్రెడర్స్కు ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను కార్పొరేటర్ ప్రభుదాస్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జి.శ్రీనివాస్రెడ్డి, కొత్త రామారావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వ్యాక్సిన్ సెంటర్ను బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి ప్రారంభించారు.