చర్లపల్లి, మే 25 : ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిపై కక్ష్యతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఏఎస్రావునగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బేతాల బాల్రాజు పేర్కొన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని కమలానగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంను కాపాడేందుకు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తగిన చర్యలు తీసుకోవడంతో జీర్ణించుకోలేని కొంతమంది కబ్జాకోరులు ఎదురు కేసులు పెట్టి బెదిరించేందుకు కుట్ర పన్నారని వారు ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదోవ పట్టించి కేసులు నమోదు చేసే విధంగా కబ్జాకారులు కుట్రపన్నారని, విచారణ అనంతరం ఆక్రమణదారుల బండారం బయట పడుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఎంతో కృషి చేశారని వారు గుర్తు చేశారు. ఆక్రమణదారులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తామంత ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి సహకరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సురేందర్రావు, నాయకులు మణిపాల్రెడ్డి, గొలిశ్రీనివాస్, ఏనుగు సీతారామిరెడ్డి, కుమారస్వామి, మహ్మద్ బాజీబాషా, మురళీపంతులు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.