కాప్రా : నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం హెచ్బీకాలనీ డివిజన్ రాజీవ్నగర్, కైలాసగిరి, నవోదయనగర్ కాలనీల్లో కుషాయిగూడ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ జీ శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేరరహిత సమాజం కోసం ప్రతి కాలనీలో సీసీకెమెరాల అవసరం ఎంతోఉందని అన్నారు. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రాజీవ్నగర్, కైలాసగిరి,నవోదయ నగర్ కాలనీలు వేగంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుషాయిగూడ సీఐ మన్మోహన్, ఎస్ఐ మదన్మోహన్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, గరిక సుధాకర్, కిరణ్కుమార్రెడ్డి, కేసీ మోహ న్, వెంకటాచారి, బాలరాజు, బోదాసు రవి,నరేశ్, ఎండీరహమాన్, నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్ బాలాజీ ఎన్క్లేవ్ కమ్యూనిటీహాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీతను ఘనంగా సత్కరించారు. అనంతరం దివ్యాంగురాలికి వీల్చైర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఎన్క్లేవ్ అధ్యక్షుడు ఓంకార్సింగ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, నేతలు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల్ల కొండల్రెడ్డి, పిట్టల నరేశ్ ముదిరాజ్, పల్లె నర్సింగ్రావు, జగన్, మహేందర్, సుధాకర్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.