రామంతాపూర్, మే 7 : ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు ఇబ్బందులు లేకాండా చూడాలని ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి డాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హబ్సిగూడ డివిజన్ పరిధిలోని వెంకట్రెడ్డినగర్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ కరోనా టెస్టులు, మొదటి, రెండో డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలించి, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు సరఫరా ఎలా ఉందో తెలుసుకున్నారు. వైద్యశాలకు వచ్చే రోగులకు మంచినీరు, నీడ కోసం టెంటు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డాక్టర్లును ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యశాలకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వనంపల్లి గోపాల్రెడ్డి, డాక్టర్ బీవీచారి, గరిక సుధాకర్, శివ, గడ్డం వెంకటసాయి, సోమిరెడ్డి, యాకాంత్రావు, సూరం శంకర్, పుట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..
రామంతాపూర్కు చెందిన ఆర్. సుజాతకు రూ. 38 వేలు, అత్పాసన్కు రూ. 34 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను హబ్సిగూడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతోమంది పేదలకు వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న, నాయకులు పల్ల కిరణ్కుమార్రెడ్డి, గంగిడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి పత్రం..
వ్యాక్సినేషన్ 18 ఏండ్లు నిండివారికి ఇవ్వాలని కోరుతూ సీపీఎం నాయకులు ఎర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. కరోనా టెస్టుల కోసం ప్రజలు బారులు తీరుతున్నారని, సెంటర్లు పెంచాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీష్మాచారి, ఉపేందర్, భిక్షపతి, పెద్దస్వామి తదితరులు పాల్గొన్నారు.