చర్లపల్లి, మే 5 : పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, జమ్మిగడ్డకు చెందిన మాణిక్యం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్యం కోసం మంజూరైన రూ.2.50 లక్షల సీఎం రిలీఫ్ఫండ్ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్యెల్యే బేతి సుభాష్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రేటర్ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ పాజ్జూరి పావనీమణిపాల్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బేతాల బాల్రాజు, నాయకులు మణిపాల్రెడ్డి, గరిక సుధాకర్, ముత్యంరెడ్డి, బాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, మే 5 : కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని బాబానగర్ మసీద్లో బుధవారం రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజలందరూ పండుగలు సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కానుకలు అందజేస్తున్నారని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, పేద, మధ్యతరగతి ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు.