చర్లపల్లి, మే 4 : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్ ఫేజ్-3 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివసాయినగర్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నామని, వచ్చే వర్షాకాలం నాటికి నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కాలనీలో మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే అధికారులు కాలనీలో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ, మాధవి, సీసీఎల్ ప్రతినిధి పద్మారెడ్డి, సత్యనారాయణ, పురుశోత్తంరెడ్డి, అంజలి, సుదర్శన్గౌడ్, మాధవి, రాము, రాజేశ్వరి, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, మేకల ముత్యం, మహేందర్రెడ్డి, సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమలానగర్లో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొజ్జ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలో అదనంగా వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డివిజన్ల వారీగా రసాయనాల పిచికారీ పనులు, పారిశుధ్య పనులను ముమ్మరం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమలానగర్ సంక్షేమ సంఘం, టీఆర్ఎస్ నాయకులు బేతాల బాల్రాజు, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, మేకల ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.