చర్లపల్లి, మే 3 : అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్లో మసీద్లో రంజాన్ పండుగ కానుకలను మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావులతో కలిసి ముస్లిం మైనార్టీలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రధానంగా మైనార్టీలకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించడంతో పాటు షాదీ ముబారక్ వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నియోజకవర్గం పరిధిలోని మసీద్లలో సౌకార్యలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేతాల బాల్రాజు, ఏనుగు సీతారామిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కుమార స్వామి, మహ్మద్ బాజీబాషా, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, అరిటికాయల భాస్కర్, కొప్పుల కుమార్, కృష్ణారెడ్డి, శాగ రవీందర్, ప్రశాంత్గౌడ్, మసీద్ కమిటీ సభ్యులు మన్సూద్, జావీద్, కలాం, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.
కాప్రాలో ‘రంజాన్ తోఫాలు’..
కాప్రా, మే 3: పేద ముస్లిం సోదరులు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ ప్రతి యేటా రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. సోమవారం కాప్రా డివిజన్ వంపుగూడ ‘మసీద్-ఈ- ఫయాజ్ ’ మసీద్లో, మహ్మదీయకాలనీలోని ‘ఫక్రుల్ ఇస్లాం మసీద్’ లో జరిగిన రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్, మసీద్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ సలీం, తాహెర్, ఎండీ గౌస్, టీఆర్ఎస్ నాయకులు కొప్పులకుమార్, అరటికాయల భాస్కర్, గడ్డం రవికుమార్, శాగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి చేయూతనందిస్తాం..
ఉప్పల్, మే 3 : ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి చేయూతనందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్లోని లక్ష్మీనారాయణకాలనీలో రంజాన్ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం అందించే రంజాన్ కానుకలను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు రఫీక్, ప్రధాన కార్యదర్శి షేక్ జాకీర్, నేతలు గడ్డం రవికుమార్, అరిటికాయల భాస్కర్ ముదిరాజ్, గరిక సుధాకర్, ఎండీ.ముస్తాక్, గంగిడి కృష్ణారెడ్డి, శాగ రవీందర్, ప్రశాంత్, జీనత్బేగం, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.