హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయన జారిపడటంతో గాయాలయ్యాయి.
వైద్యుల సలహా మేరకు ఆయన విశ్రాంతి తీసుంటున్నారు. నెల రోజులపాటు ఎంపీ రంజిత్ రెడ్డికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.
వైద్యుల సూచన మేరకు నెలరోజులపాటు నియోజవర్గంలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోనని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. అత్యవసర సమయంలో తన బృందం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.