మేడ్చల్, అక్టోబర్24(నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని తెలంగాణ ప్రజలందరూ పండగలా భావిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలందరూ విశ్వసిస్తున్నారన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాలకు ప్రజలందరూ పండగలా భావిస్తారన్నారు. ఆహ్వానాలు అందిన ప్రజాప్రతినిధులు, క్రియాశీలక నాయకులు ప్లీనరీకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్లీనరీకి హాజరుకావాలని మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు, క్రియాశీల నాయకులకు ప్లీనరీ ఆహ్వాన కమిటీ నుంచి ఆహ్వానాలు అందా యి. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, క్రియాశీల నాయకులు ప్లీనరీలో పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, నవీన్రావు, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖరెడ్డిలు ప్లీనరీకి ఆహ్వానాలు అందినవారు హాజరుకావాలని పేర్కొన్నారు. ప్లీనరీ సందర్భంగా వివిధ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది.
మల్కాజిగిరి, అక్టోబర్ 24 : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. ఆదివారం మల్కాజిగిరిలో ఎమ్మెల్యే ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం రెండు దశాబ్దాల కిందట ఒంటిరిగా కదిలిన కేసీఆర్ లక్ష్యం చేరడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నిరంతరం తపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. హైటెక్స్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేస్తామని అన్నారు.